షాకింగ్: డ్రగ్స్ కేసులో దీపికా పడుకోనే కూడా!
on Sep 21, 2020
సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య చేసుకున్నాడా? అతడిని ఎవరైనా చంపేశారా? లేదంటే ఆత్మహత్యకు ఎవరైనా ప్రేరేపించారా? వంటి ప్రశ్నలకు సమాధానాలు ఇప్పటిలో లభించడం కష్టమే కావచ్చు. ఎందుకంటే... సుశాంత్ సూసైడ్ కేసు ఇప్పుడు డ్రగ్స్ చుట్టూ తిరుగుతోంది. సుశాంత్ లవర్ రియా చక్రవర్తి ఇచ్చిన స్టేట్మెంట్ మేరకు బాలీవుడ్ స్టార్ హీరోయిన్లకు సమన్లు జారీ చేసేందుకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) రెడీగా ఉంది.
రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీ ఖాన్, బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ స్నేహితురాలు, డిజైనర్ సిమోన్ ఖంబట్టా డ్రగ్స్ తీసుకున్నారని రియా చక్రవర్తి స్టేట్మెంట్ ఇచ్చారనేది తెలిసిన వార్తే. ప్రభాస్ సరసన 'సాహో' సినిమాలో నటించిన శ్రద్ధా కపూర్ పేరు సోమవారం బయటకొచ్చింది. అంతకంటే షాకింగ్ ఏంటంటే... బాలీవుడ్ స్టార్ హీరోయిన్, రణ్వీర్ సింగ్ భార్య దీపికా పడుకోనే కూడా డ్రగ్స్ కేసులో ఉన్నారు. త్వరలో ఆమెకు సమన్లు జారీ చేయనున్నారు. ఇప్పటివరకు చెప్పిన హీరోయిన్లకు సమన్లు జారీ చేయనున్నట్టు ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ కేపీఎస్ మల్హోత్రా చెప్పారు.
రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్, మరికొంతమందిని అరెస్ట్ చేసి విచారిస్తున్న ఎన్సీబీ... చాటింగ్ లో 'డి' అంటే దీపికా పడుకోన్ అని గుర్తించిందట. ఎన్డీపీఎస్ చట్టంలోని సెక్షన్ 67 ప్రకారం సమన్లు జారీ చేసి హీరోయిన్లను విచారించనున్నారు.