పదేళ్ల తర్వాత చిరంజీవితో....
on Jul 11, 2020
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా సందేశాత్మక కథలకు వాణిజ్య హంగులు అదే కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'ఆచార్య'. దీనికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఆల్రెడీ మూడు పాటలను రికార్డింగ్ చేశారు. ఇప్పటివరకూ కొరటాల చిత్రాలు అన్నిటికీ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. మెగాస్టార్ చెప్పడంతో మణిశర్మను తీసుకున్నారట.
చిరంజీవి, మణి శర్మది హిట్ కాంబినేషన్. చిరంజీవి నటించిన బావగారూ బాగున్నారా, చూడాలని ఉంది, ఇద్దరు మిత్రులు, అన్నయ్య, మృగరాజు, ఇంద్ర, ఠాగూర్, స్టాలిన్ చిత్రాలకు మణిశర్మ మంచి బాణీలు ఇచ్చారు. ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పదేళ్ల తర్వాత చిరంజీవి గారు చిత్రానికి, 'ఆచార్య'కు సంగీతం అందిస్తున్నానని మణిశర్మ చెప్పారు.
"సినిమాలో మూడు పాటలు రికార్డింగ్ చేశా. మిగతా ట్యూన్స్ కూడా కంపోజ్ చేశా. రికార్డింగ్ చేసేలోగా కరోనా వచ్చింది. పనికి అంతరాయం ఏర్పడింది. సినిమాలో ఒక ఐటెం సాంగ్, ఇద్దరు హీరోల మీద ఒక సాంగ్, ఒక డ్యూయెట్, ఓ మెలోడీ, ఎమోషనల్ సాంగ్, మంచి డాన్స్ నెంబర్ ఉన్నాయి సన్నివేశాల పరంగా కొన్ని పాటలు వస్తాయి. పాటలన్నీ వేటికవే వైవిధ్యంగా ఉంటాయి. పాటల కంటే ఈ సినిమాలో నేపథ్య సంగీతానికి ఎంతో ప్రాధాన్యం ఉంది" అని మణి శర్మ తెలిపారు.