హుద్ హుద్ వల్ల మంచే జరిగిందంటున్న హీరో!
on Oct 30, 2014
హుద్ హుద్ తుపానుతో పచ్చటి ఉత్తరాంధ్ర మొత్తం కొట్టుకెళ్లిపోతే.. ఆ తుపాను వల్ల మంచే జరిగిందంటున్నాడు ఓ హీరో. అయ్యో.. అవేం మాటలు...?? అంటూ నివ్వెర పోకండి. ఈ హీరో అంటున్న మాటల్లోనూ కాస్త లాజిక్ ఉంది. ఇంతకీ ఆ హీరో ఎవరంటే... మంచు మనోజ్. ఆయన హుద్ హుద్ కోసం ఇలా ఎందుకు స్పందించాడంటే... ''సెల్పోన్ల వల్ల ప్రపంచం చిన్నదైపోయింది అంటున్నారు. కానీ మనుషుల మధ్య దూరం పెరిగిపోతోంది. ప్రతి ఒక్కరూ.. సెల్ చేతిలో పట్టుకొని తమ లోకంలో తాము మునిగిపోతున్నారు. ఆడవాళ్లు.. ఇంట్లో టీవీలకు అతుక్కుపోతున్నారు. పెద్దవాళ్లు కులం మతం జాతి అంటూ కొట్టుకొంటున్నారు. ఇప్పుడేమైంది..?? హుద్ హుద్ ఎలాంటి బేధం లేకుండా అందరికీ నష్టం కలిగించి వెళ్లిపోయింది. హుద్ హుద్ వల్లే.. అందరూ మళ్లీ ఏకమవుతున్నాం. కుల మతాలు పట్టించుకోకుండా ఒకరికి ఒకరు సాయం చేసుకొంటున్నాం. సెల్ఫోన్లు పనిచేయని రోజుల్లో అందరూ పక్క పక్కన కూర్చుని మాట్లాడుకోగలుగుతున్నాం. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇప్పుడు ఎలా బాగుపడదాం అంటూ సానుకూల దృక్పథంతో ఆలోచించగలుగుతున్నాం. హుద్ హుద్ వల్ల.. ఇన్ని మంచి పనులు జరిగాయి...'' అంటున్నాడు. మనోజ్ మాటల్లోనూ నిజం ఉందనిపిస్తోంది కదూ..!