అప్పుడు రజినీ.. ఇప్పుడు ధనుష్..
on Nov 20, 2020
మలయాళం, హిందీ, కన్నడ, తమిళ్.. ఇలా భాషాబేధం లేకుండా పలు భాషల్లో నాయికగా సందడి చేస్తున్నారు ఛాయాగ్రహకుడు కె.యు. మోహనన్ తనయ మాళవికా మోహనన్. ఆ మధ్య సూపర్ స్టార్
రజినీకాంత్ పేట చిత్రంలో ఓ కీలక పాత్రలో సందడి చేసిన ఈ స్టన్నింగ్ బ్యూటీ.. త్వరలో అతని అల్లుడు, కోలీవుడ్ స్టార్ ధనుష్ కొత్త సినిమాలో నాయికగా నటించనున్నారట.
ఆ వివరాల్లోకి వెళితే.. కార్తిక్ నరేన్ దర్శకత్వంలో ధనుష్ ఓ సినిమా చేయబోతున్నారు. సత్యజ్యోతి ఫిల్మ్స్ సంస్థ నిర్మించనున్న ఈ సినిమా నటుడిగా ధనుష్ కి 43వ చిత్రం. కాగా ఈ ప్రాజెక్ట్ లో ధనుష్ కి
జోడీగా మాళవికా మోహనన్ ఎంపికయ్యారని సమాచారం. మరి.. రజినీ చిత్రంతో విజయాన్ని అందుకోలేకపోయిన మాళవికా.. ధనుష్ మూవీతోనైనా సక్సెస్ చూస్తారేమో చూడాలి.
కాగా, విజయ్ కి జోడీగా మాళవికా మోహనన్ నటించిన తమిళ చిత్రం మాస్టర్ వచ్చే ఏడాది ఆరంభంలో థియేటర్స్ లో సందడి చేయనుంది.