మహేష్.. ఎన్టీఆర్.. మళ్లీ కలిశారు!
on Apr 9, 2019
సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మళ్లీ కలిశారు. ఈ కలయికకు కారణం దర్శకుడు వంశీ పైడిపల్లి. ఆయన సతీమణి మాలిని పైడిపల్లి పుట్టినరోజు పార్టీకి ప్రణతి సమేత ఎన్టీఆర్, నమ్రత సమేత మహేష్ హాజరయ్యారు. ఈ పార్టీ లో మహేష్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ జేవియర్ దంపతులు కూడా పాల్గొన్నారు. సోమవారం రాత్రి సరదాగా కబుర్లు చెప్పుకున్నారు. కాలక్షేపం చేశారు. 'భరత్ అనే నేను' ప్రీ రిలీజ్ ఫంక్షన్ 'భరత్ బహిరంగ సభ' వేదికగా మహేష్, ఎన్టీఆర్ స్నేహం అందరికీ తెలిసింది. ఆ తర్వాత రామ్ చరణ్ తో పాటు వీరిద్దరూ చాలాసార్లు కలిశారు. ఆయా పార్టీల ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. మాలిని పైడిపల్లి పుట్టినరోజు సందర్భంగా మరోసారి స్నేహితులు కలిశారు. ఎన్టీఆర్ హీరోగా నటించిన 'బృందావనం' చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. ప్రస్తుతం మహేష్ హీరోగా 'మహర్షి' తెరకెక్కిస్తున్నారు.