`ఖైదీ` దర్శకుడితో ప్రభాస్?
on Apr 5, 2021
`ఖైదీ` చిత్రంతో తమిళ, తెలుగు భాషల్లో ఘనవిజయం అందుకున్నారు దర్శకుడు లోకేశ్ కనకరాజ్. అంతేకాదు.. ఆ సినిమాతో కోలీవుడ్ స్టార్ కార్తికి ఓ మెమరబుల్ హిట్ ని అందించారు. `ఖైదీ` తరువాత ఇళయ దళపతి విజయ్ కాంబినేషన్ లో `మాస్టర్` చేశారు లోకేశ్. సంక్రాంతికి విడుదలైన ఈ యాక్షన్ డ్రామా.. తమిళ, తెలుగు భాషల్లో ఆదరణకు నోచుకుంది. ప్రస్తుతం లోకనాయకుడు కమల్ హాసన్ తో `విక్రమ్` చేస్తున్నారు లోకేశ్. ఆ తరువాత తన నెక్ట్స్ వెంచర్ ని కూడా ఓ అగ్ర కథానాయకుడితో ప్లాన్ చేస్తున్నారట. ఆ స్టార్ మరెవరో కాదు.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.
ఆ వివరాల్లోకి వెళితే - ఇటీవల లోకేశ్.. ప్రభాస్ ని సంప్రదించి ఓ ఆసక్తికరమైన కథ చెప్పారట. స్టోరీ, క్యారెక్టర్ నచ్చడంతో.. ప్రభాస్ ఈ ప్రాజెక్ట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. త్వరలోనే ప్రభాస్, లోకేశ్ ఫస్ట్ కాంబినేషన్ మూవీపై క్లారిటీ వస్తుంది.
కాగా, ప్రస్తుతం ప్రభాస్ చేతిలో `సలార్`, `ఆదిపురుష్`, నాగ్ అశ్విన్ కాంబినేషన్ మూవీ ఉన్నాయి. వీటికంటే ముందు ప్రభాస్ నటించిన పిరియడ్ లవ్ సాగా `రాధేశ్యామ్` జూలై 30న థియేటర్స్ లో సందడి చేయనుంది.