పెళ్లెప్పుడు? అని ప్రశ్నిస్తే... గట్టిగా క్లాస్ పీకింది!
on Oct 17, 2020
హీరోయిన్లను పెళ్లి గురించి ప్రశ్నిస్తే కొంచెం కోపం, మరికొంచెం వ్యంగ్యం కలిపి సమాధానాలు ఇస్తున్నారు. పెళ్లి అంటే 'మీకెందుకు?' అన్నట్టు కొంతమంది రిప్లైలు ఇస్తున్నారు. లేటెస్టుగా ఈ లిస్టుగా అందాల రాక్షసి లావణ్యా త్రిపాఠి కూడా చేరారు.
ఇన్స్టాగ్రామ్లో లావణ్యా త్రిపాఠికి 'పెళ్లి ఎప్పుడు?' అనే ప్రశ్న ఎదురైంది. 'నా పెళ్లి గురించి నువ్వు వర్రీ అవ్వడం ఎందుకు?' అని క్లాస్ పీకారు. ప్రశ్న అడిగినవాళ్లను తమ గురించి వర్రీ అవ్వమని సలహా ఇచ్చారు. అంతే కాదు... ఇంకొకరు అయితే 'పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్? నా దగ్గర నీ చేతికి సరిపోయే రింగ్ ఉంది' అని ఇన్డైరెక్ట్గా ప్రపోజ్ చేశాడు. "ఎందుకు? అమ్మాయిలూ రింగు కొనుక్కోలేరా?" అని లావణ్యా త్రిపాఠి వెటకారంతో కూడిన రిప్లై ఇచ్చారు.
ప్రస్తుతం తెలుగులో 'ఏ1 ఎక్స్ ప్రెస్', 'చావు కబురు చల్లగా' సినిమాల్లో లావణ్యా త్రిపాఠి కథానాయికగా నటిస్తున్నారు. హాకీ నేపథ్యంలో 'ఏ1 ఎక్స్ ప్రెస్'లో సందీప్ కిషన్ హీరో కాగా, 'చావు కబురు చల్లగా'లో కార్తికేయ గుమ్మకొండ హీరో.