నదియా.. మళ్ళీ ట్రాక్లోకి వచ్చేనా?
on Mar 3, 2021
తెలుగునాట `బజారు రౌడీ`, `వింత దొంగలు`, `ఓ తండ్రి ఓ కొడుకు` వంటి సినిమాల్లో కథానాయికగా నటించినా రాని స్టార్ డమ్.. `మిర్చి`, `అత్తారింటికి దారేది`, `దృశ్యం`, `అ ఆ` వంటి చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించినప్పుడు దక్కించుకుంది నదియా. అయితే.. `అ ఆ` తరువాత ఆమె ముఖ్య పాత్రల్లో నటించిన `నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా`, నెట్ ఫ్లిక్స్ లో గత ఏడాది రిలీజైన `మిస్ ఇండియా`.. తన కెరీర్ కి ఏ మాత్రం ప్లస్ కాలేకపోయాయి.
ఈ నేపథ్యంలో.. రాబోయే కొత్త చిత్రాలపైనే ఆశలు పెట్టుకుంది ఈ టాలెంటెడ్ యాక్ట్రస్. ప్రస్తుతం నదియా చేతిలో `వరుడు కావలెను`, `గని`, `దృశ్యం 2` చిత్రాలున్నాయి. తక్కువ గ్యాప్ లోనే రానున్న ఈ సినిమాలతోనైనా నదియా మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వస్తుందేమో చూడాలి.
`వరుడు కావలెను`లో టాలెంటెడ్ హీరో నాగశౌర్య కథానాయకుడు కాగా.. `గని`లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్నాడు. ఇక `దృశ్యం`కి సీక్వెల్ గా రూపొందుతున్న `దృశ్యం 2`లో విక్టరీ వెంకటేశ్ ప్రధాన పాత్రధారి.
Also Read