చింతచెట్టుతో భయపెట్టనున్న కోడి
on Apr 17, 2014
ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం "అవతారం". ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రాధిక కుమారస్వామి, రిషి ప్రధాన పాత్రలలో నటించారు. భానుప్రియ ఓ కీలక పాత్రలో నటించారు. "అమ్మోరు", "అరుంధతి" చిత్రాల తరహాలోనే ఈ చిత్రం కూడా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు చిత్ర బృందం. శ్రీమతి యం.కవిత సమర్పణలో అరుంధతి ఆర్ట్ ఫిలిమ్స్ బ్యానర్లో నిర్మాత యం.యుగంధర్ రెడ్డి నిర్మించారు.
ఈ చిత్రం తర్వాత దర్శకుడు కోడి రామకృష్ణ మరో 5 చిత్రాలను తెరకెక్కించనున్నాడు. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో "పుట్టపర్తి సత్య సాయిబాబా" చిత్ర షూటింగ్ 40 శాతం పూర్తయ్యింది. అలాగే యాక్షన్ కింగ్ అర్జున్, లక్ష్మీ రాయ్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న "రాణీ రాణమ్మ" చిత్రం కూడా తెరకెక్కుతుంది. అలాగే "అంకుల్ ఆంజనేయస్వామి", "చింతచెట్టు", "ఆవు" అనే చిత్రాలను తెరకెక్కించనున్నారు. నటుడు రాజేంద్రప్రసాద్ తో "అంకుల్ ఆంజనేయస్వామి" చిత్రాన్ని తెరకెక్కించడానికి కోడి రామకృష్ణ సన్నాహాలు చేస్తున్నారు. అలాగే తన ఊళ్ళో, తన కళ్ళ ముందు జరిగిన కొన్ని సంఘటనలతో "చింత చెట్టు" అనే చిత్రం తీయనున్నాడు కోడి రామకృష్ణ. ఇది పూర్తి హార్రర్ సినిమా. ఈ చిత్రాలకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.