'కెజిఎఫ్' హీరోపై క్రికెటర్ పైచేయి
on Feb 22, 2020
ప్రముఖ ఆంగ్ల దినపత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రతి ఏడాది 'మోస్ట్ డిజైరబుల్ మెన్' పేరుతో ఏ నగరానికి ఆ నగరంలో సర్వే చేస్తుంటుంది. మహిళలకు మరో సర్వే చేస్తుందనుకోండి. ప్రతి ఏడాది టైమ్స్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసే రిజల్ట్స్ కోసం కొంతమంది ఇంట్రెస్టింగ్ గా చూస్తారు. 'బెంగళూరు టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ ఆఫ్ 2019' రిజల్ట్స్ 'కెజిఎఫ్' హీరో యష్ అభిమానులకు షాక్ ఇచ్చాయి. ఎందుకంటే... గతేడాది టాప్ ప్లేస్ లో ఉన్న అతడు, ఈ ఏడాది సెకండ్ ప్లేస్ కి పడ్డాడు.
గతేడాది మూడో ప్లేస్ లో ఉన్న క్రికెటర్ కెఎల్ రాహుల్ ఈసారి టాప్ పొజిషన్ లో నిలిచాడు. రెండో స్థానానికి పడ్డాడంటే యష్ క్రేజ్ తగ్గిందని అనుకోవద్దు. అతడి కంటే కెఎల్ రాహుల్ క్రేజ్ పెరిగింది. 'కెజిఎఫ్'తో కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్లో యష్ క్రేజ్ సంపాదించాడు. ఆ సినిమా సాధించిన విజయంతో 'కెజిఎఫ్' సెకండ్ పార్ట్ ను మరింత గ్రాండ్ గా తీస్తునన్నారు. ప్రజెంట్ ఈ సినిమా షూటింగ్ చేస్తున్నారు. ఇందులో సంజయ్ దత్, రావు రమేష్, రవీనా టాండన్ తదితరులు నటిస్తున్నారు. నటీనటుల్లో అన్ని భాషల వారు ఉండేలా జాగ్రత్తలుతీసుకుంటున్నారు.
Also Read