'ఆగస్ట్ 1' నందమూరి ఫ్యాన్స్ కు పండగే
on Jul 31, 2014
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరీ స్పీడైపోయారు. రభస షూటింగ్ తరువాత అసలు విరామం తీసుకోకుండా మరో సినిమాకి రెడీ అవుతున్నాడు. ఎన్టీఆర్ పూరీ కాంబినేషన్లో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రారంభోత్సవం పూరి కొత్త కార్యాలయం కేవ్ లో ఆగస్టు 1 ఉదయం ఏడుగంటలకు జరుగుతుంది. పూరి చాలా కాలం తరువాత ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్నారు. దీనికి ఆయన ఆప్తుడు బండ్ల గణేష్ నిర్మాత. అయితే రేపు మరో విశేషం కూడా వుంది. నందమూరి అభిమానులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న రభస ఆడియో ఫంక్షన్ కూడా రేపు జరగనుంది. దీంతో ఆగస్టు 1 నందమూరి అభిమానులకు పండగే!