సుమన్ తో జయహో తెలంగాణ
on Apr 24, 2014
సుమన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం "జయహో తెలంగాణ". అమరవీరుల త్యాగఫలం అనేది ఉపశీర్షిక. కొత్తపల్లి సతీష్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిరియాల రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇంద్ర, మధుబాల కథానాయికలు. ఇటీవలే హైదరాబాదులో ఈ చిత్ర ముహూర్త కార్యక్రమాలు జరిగాయి. తొలి సన్నివేశానికి కోదండరామ్ క్లాప్ కొట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... "తెలంగాణాలో సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం ఓ నట శిక్షణాలయం ఏర్పరుస్తాం. సినిమాలకు పన్ను మినహాయింపును కల్పిస్తాం" అని అన్నారు. సుమన్ ఇందులో ప్రొఫెసర్ పాత్రలో కనిపించనున్నారు. వచ్చే నెల ద్వితీయార్ధం నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. దసరా కానుకగా సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.