ఎన్టీఆర్ సరసన శ్రీలంక సుందరి?
on Apr 25, 2019
'ఆర్.ఆర్.ఆర్'లో ఎన్టీఆర్ సరసన నటించేది ఎవరు? బ్రిటన్ బ్యూటీ డైసీ ఎడ్గార్ జోన్స్ తప్పుకున్న తర్వాత పలువురి పేర్లు వినిపించాయి. హిందీ హీరోయిన్లు శ్రద్ధా కపూర్, పరిణితి చోప్రా, కృతిసనన్... దక్షిణాది భామ నిత్యా మీనన్ తదితరుల్లో ఎవరో ఒకరిని ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. వీటిపై దర్శకుడు రాజమౌళి గాని... 'ఆర్.ఆర్.ఆర్' యూనిట్ సభ్యులు గాని స్పందించలేదు. పుకార్లు షికార్లు చేశాయి. అయితే... రాజమౌళి దృష్టిలో వీరెవరూ లేరట! విదేశీ భామ కోసమే ఆయన అన్వేషణ సాగిస్తున్నారట. కథ ప్రకారం విదేశీ భామకు, ఎన్టీఆర్ కు మధ్య లవ్ ట్రాక్ ఉందట. అందువల్లనే, డైసీ ఎడ్గార్ జోన్స్ ను తీసుకున్నారు. ఆమె తప్పుకోవడంతో ఆ స్థానంలో మరో విదేశీ భామను ఎంపిక చేయాలని ఆలోచిస్తున్నారట.
ఈ తరుణంలో రాజమౌళికి బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఓ సలహా ఇచ్చారట. శ్రీలంక సుందరి జాక్వలిన్ ఫెర్నాండేజ్ ని కథానాయికగా తీసుకోమని కోరారట. ఇవ్వడానికి జాక్వలిన్ శ్రీలంక దేశస్థురాలు అయినా... ఆమెలో బ్రిటిష్ పోలికలు ఉంటాయి. సో... ఎన్టీఆర్ కు జోడీగా ఆమెను ఎంపిక చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికే 'ఆర్.ఆర్.ఆర్'లో ఇద్దరు బాలీవుడ్ యాక్టర్స్ ఉన్నారు. సినిమాలో మరో హీరో రామ్ చరణ్ కి జోడీగా అలియా భట్ నటిస్తుండగా... ఓ కీలక పాత్రలో అజయ్ దేవగణ్ నటిస్తున్నారు. జాక్వలిన్ కూడా ఎంపికైతే హిందీలో సినిమాకు మరింత క్రేజ్ వస్తుంది.