టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్న మరో స్టార్ హీరోయిన్ కూతురు.!!
on Sep 11, 2018
త్వరలో టాలీవుడ్ లోకి మరో స్టార్ హీరోయిన్ కూతురు అడుగుపెట్టబోతుంది.టాలివుడ్ లో బాలనటి గా అడుగుపెట్టి అనతికాలంలోనె కథానాయిక గా నటించి తనకంటూ గొప్ప పేరు తెచ్చుకొని అతి తక్కువ కాలంలోనె నంది అవార్డులను కైవసం చేసుకొన్న కథానాయిక లయ.తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషలలో 60 పైగా సినిమాలలో నటించిన లయ చివరిసారిగా బ్రహ్మలొకం టూ యమలోకం వయా భూలోకం చిత్రంలో కనిపించి, ఆ తరువాత అమేరికా లొ ఉద్యోగం చెస్తున్న అబ్బాయి ని పెళ్లి చేసుకొని సినిమాలకి దూరంగా ఉంది. ప్రస్తుతం లయ తన భర్త,కూతురు,కూమరుడి తో కలిసి అమెరికా లోనె నివసిస్టుంది.ఇప్పుడు లయ కూతురు టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది.
శ్రీను వైట్ల గారి దర్శకత్వంలో రవితేజ,ఇలియానా జంటగా నటిస్తున్న "అమర్ అక్బర్ అంటొని " సినిమాలొ కథరీత్యా కథానాయిక పాత్ర అమెరికా లొ పుట్టి పెరుగుతుంది. ఈ సినిమా లొ కథానాయిక చిన్ననాటి పాత్రని లయ కూతురు శ్లోక చేసింది. ఇంకొక విషయం ఎంటంటే ఇదే సినిమా లొ శ్లోక తల్లీ పాత్రలో లయ గారు కూడా తళూక్కున మెరవనున్నారు.అంటే ఒకే సినిమా తో కూతురి ఎంట్రీ,తల్లి రీఎంట్రీ కూడా జరగనున్నదన్నమాట. .దీనిపై తెలుగువన్ రేడియో వారు చేసిన ముఖాముఖి లో లయ గారు స్పందిస్తూ "నేను ఇండస్ట్రీ కీ వచ్చిన వయసులోనే నా కూతురు శ్లోక కూడా రావటం ,అందులో నేను కూడా కొద్దిసేపు కనిపించటం చాలా సంతోషంగా ఉంది. అలాగే నాకు తగ్గ పాత్రలు వస్తే నటించటానికి సిద్దంగా ఉన్నాను "అని చెప్పారు.
Also Read