హీరోగా ఎంట్రీ ఇస్తున్న గౌతమ్ మీనన్..!!
on Aug 7, 2018
గౌతమ్ మీనన్ పేరుకి తమిళ్ డైరెక్టర్ అయినా కూడా తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితులు.. ఘర్షణ, సూర్య సన్నాఫ్ కృష్ణన్, ఏ మాయ చేసావే లాంటి సినిమాలతో దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన గౌతమ్ మీనన్, త్వరలో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.. జై అనే ఓ నూతన తమిళ దర్శకుడు, గౌతమ్ మీనన్ కు ఓ కథ వినిపించాడట.. కథ బాగా నచ్చడం తో ఈ సినిమాలో హీరోగా నటించడానికి గౌతమ్ మీనన్ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.. దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న గౌతమ్ మీనన్, ఓ పక్క దర్శకుడిగా బిజీగా ఉంటూనే మరో పక్క నటించడానికి ఒప్పుకోవడంతో ఈ సినిమా పట్ల అప్పుడే అందరిలో ఆసక్తి మొదలైంది.. చూద్దాం మరి గౌతమ్ మీనన్ హీరోగా ఎలా మెప్పిస్తారో.