అల్లు అర్జున్ ఎంట్రీతో మహేష్ అవుట్
on Apr 22, 2017
మహేష్ బాబు ప్రతిష్టాత్మక తెలుగు-తమిళ్ ద్విభాషా చిత్రం స్పైడర్ షూటింగ్ చివరి దశలో ఉంది. ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని ముందుగా జూన్ 23 న విడుదల చేద్దాం అనుకున్నారు. కానీ, తాజా సమాచారం ప్రకారం, స్పైడర్ జులై లో కానీ, ఆగష్టు లో కానీ రావొచ్చు అంటున్నారు. భారీ బడ్జెట్ తో నిర్మించబడుతున్న ఈ సినిమాని భారీగా విడుదలకి ప్లాన్ చేసారు. కానీ, అల్లు అర్జున్ సడన్ ఎంట్రీ తో మహేష్ తన సినిమాని పోస్ట్ పోన్ చేసారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న దువ్వాడ జగన్నాధం జూన్ 23 న విడుదలవనుంది. కాంపిటేషన్ లో సినిమా విడుదల చేయడం కన్నా, వాయిదా వేయడం బెటర్ అనుకున్నట్టున్నారు స్పైడర్ దర్శక, నిర్మాతలు.
పోటీగా విడుదల చేస్తే థియేటర్లు దొరక్కపోవచ్చు మరియు ఓపెనింగ్స్ పైనా భారీగా ఎఫెక్ట్ పడుతుంది. టాప్ చైర్ కోసం వేచి చూస్తున్న బన్నీ వరుస హిట్లతో మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇవన్నీ అలోచించి స్పైడర్ మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. దువ్వాడ జగన్నాధంలో కామెడీ ప్రధానంగా ఉండగా, స్పైడర్ కంప్లీట్ ఆక్షన్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటుంది. బన్నీ సినిమా తమిళ్లో డబ్ అయి అక్కడా విడుదలవనుండగా, స్పైడర్ తెలుగు-తమిళ్లో ఒకేసారి షూటింగ్ జరుపుకొని పక్క రాష్ట్రంలో స్ట్రెయిట్ సినిమాగా విడుదలవనుంది. రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద హిట్లు కొట్టాలని ఆశిద్దాం.