చిక్కుల్లో తమిళ 'దృశ్యం'
on Jul 28, 2014
తెలుగులో రీసెంట్ హిట్ చిత్రం 'దృశ్యం' తమిళంలో రూపొందిచడానికి కమల్ హాసన్ ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శ్రీదేవి కూడా నటించబోతోంది. కన్నడ, మలయాళంలో సూపర్ హిట్టయిన ఈ చిత్రం తమిళంలో రీమేక్ చేయడానికి మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలుస్తోంది. ఆగస్టు నుంచి షూటింగ్ మొదలు పెట్టాలనుకున్న ఈ సినిమాకు కోర్టు కష్టాలు ఎదురవుతున్నాయి.
'దృశ్యం' ఒరిజినల్ మలయాళ మాతృకలో తాను కొన్న జపాన్ చిత్ర సన్నివేశాలున్నాయంటూ బాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఏక్తాకపూర్ ఆరోపిస్తున్నారు. తను రైట్స్ కొన్న చిత్రంలోని సీన్లు ఇందులో కాపీ చేశారంటూ మలయాళ 'దృశ్యం' సినిమా రచయితకు, నిర్మాతకు లీగల్ నోటీసులు పంపారు. ఇక చిత్ర కథ తాను రాసిన 'ఒరు మజకళాటు' మలయాళ నవలలోనికి అని రచయిత సతీష్ పాల్ కూడా కోర్టుకెక్కారు. ఇందుకు స్పందించిన ఎర్నాకుళం కోర్టు తమిళ వెర్షన్ దృశ్యం షూటింగ్ నిలపివేయాలంటూ ఆదేశాలిచ్చింది.