మరో మల్టీస్టారర్ సెట్ చేస్తోన్న దిల్ రాజు!!
on Dec 5, 2018
హిట్ చిత్రాల నిర్మాతగా పేరు తెచ్చుకుని వరుస చిత్రాలతో బిజీ బిజీగా ఉండే దిల్ రాజు ప్రజంట్ కాస్త స్లో అయ్యాడనే చెప్పాలి. ఈ యేడాది విడుదలైన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవడంతో ఆచితూచి అడుగేస్తూ కాంబినేషన్స్ సెట్ చేసే పనిలో పడ్డాడు దిల్ రాజు. ప్రస్తుతం వెంకటేష్, వరుణ్ తేజ్లతో మల్టీస్టారర్ గా `ఎఫ్ 2` చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం ఆఖరి దశలో ఉంది. అలాగే అశ్వనిదత్ , పివిపితో కలిసి మహేష్ బాబుతో `మహర్షి` చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా కూడా ఆఖరి దశలో ఉంది.
ఇదిలా ఉంటే మరో మల్టీస్టారర్ చిత్రాన్ని లైన్ లో పెట్టే పనిలో ఉన్నాడు దిల్ రాజు. ఇటీవల ఇంద్రగంటి మోహన్ కృష్ణతో దిల్ రాజు ఒక సినిమా ఎనౌన్స్ చేశాడు. ఇంత వరకు ఆర్టిస్ట్ లు ఎవరన్నది తెలియరాలేదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఒక వార్త హ ల్ చల్ చేస్తోంది. అదేమిటంటే...ఇంద్రగంటి దర్శకత్వంలో నాని, దుల్కర్ సల్మాన్ లతో ఒక మల్టీస్టారర్ చిత్రం ప్లాన్ చేసాడట దిల్ రాజు. ఇప్పటికే ఈ సినిమా కు సంబంధించిన కథా చర్చలు కూడా ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నాని, దుల్కర్ లు బిజీ బిజీగా ఉన్నారు. వారి కమిట్ మెంట్స్ పూర్తి కాగానే దిల్ రాజు బేనర్ లో నటించే అవకాశాలున్నాయట. చూద్దాం అప్పటి వరకు ఏమవుతుందో ఏంటో??