రామ్ - లింగుస్వామి చిత్రానికి డీఎస్పీ బాణీలు?
on Feb 25, 2021
ఎనర్జిటిక్ స్టార్ రామ్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో `ఉప్పెన` ఫేమ్ కృతి శెట్టి నాయికగా నటించబోతోందని ప్రచారం సాగుతోంది. కాగా, ఈ బైలింగ్వల్ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించబోతున్నారని సమాచారం. తాజాగా దర్శకుడు లింగుస్వామి, డీఎస్పీ మధ్య ఈ మేరకు చర్చలు సాగాయని టాలీవుడ్ టాక్.
అదే గనుక నిజమైతే.. లింగుస్వామి, దేవిశ్రీ కాంబోలో వచ్చే ఫస్ట్ ఫిల్మ్ ఇదే అవుతుంది. ఇక రామ్, డీఎస్పీ కాంబినేషన్ లో `జగడం`, `రెడీ`, `శివమ్`, `నేను శైలజ`, `ఉన్నది ఒకటే జిందగీ`, `హలో గురూ ప్రేమ కోసమే` సినిమాలు వచ్చాయి. త్వరలోనే రామ్ - లింగుస్వామి కాంబో మూవీలో డీఎస్పీ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది. కాగా, మే నుంచి ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళనుంది. ఏడాది చివరలో థియేటర్స్ లో సందడి చేసే అవకాశముంది.