డ్రగ్స్ కేసు తర్వాత ప్రభాస్ గురించే పోస్ట్ చేసింది
on Oct 23, 2020
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే హీరోయిన్లలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె ఒకరు. అటువంటి ఆమె కొన్ని రోజుల నుండి ఇంస్టాగ్రామ్ లో కనిపించడం లేదు. డ్రగ్స్ కేసులో తన పేరు రావడం, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) విచారించడం వంటివి జరిగిన తరువాత సోషల్ మీడియా కి దూరంగా ఉన్నారు. మళ్లీ ఈరోజు ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యక్షం అయ్యారు.
'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ నిర్మించనున్న భారీ బడ్జెట్ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకొనే నటించనున్న సంగతి తెలిసిందే. తన హీరోకి ఈరోజు బర్త్ డే విషెస్ చెప్పింది. "ప్రియమైన ప్రభాస్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు. నువ్వెప్పుడు ఆరోగ్యంతో ఆనందంతో ఉండాలని కోరుకుంటున్నాను. ఈ ఏడాది నీకు గొప్పగా ఉండాలి" అని దీపికా పదుకొనే ఇంస్టాగ్రామ్ స్టోరీ లో పేర్కొన్నారు. డ్రగ్స్ కేసు తర్వాత దీపిక పోస్ట్ చేసిన తొలి ఇంస్టాగ్రామ్ స్టోరీ ఇదే కావడం గమనార్హం.