కరోనా కేసులు దాస్తున్న టాలీవుడ్?
on Aug 8, 2020
టాలీవుడ్ సినిమా ప్రముఖులు తమకు కరోనా వచ్చిన సంగతి చెప్పుకోవడానికి వెనకడుగు వేస్తున్నారా? గుట్టు చప్పుడు కాకుండా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా? కరోనా సోకిన విషయాన్ని దాస్తున్నారా? 'అవును' అని ఇండస్ట్రీ గుసగుస. టాలీవుడ్ కరోనా కేసులు దాస్తోందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
'ఆర్ఆర్ఆర్' నిర్మాత డి.వి.వి. దానయ్య కరోనా పాజిటివ్. ఈ విషయం ఆయన బయటకు చెప్పలేదు. వేగుల ద్వారా మీడియాకి సమాచారం వచ్చింది. కొన్ని రోజుల క్రితం ఒక ప్రముఖ హీరో కుమార్తె నిర్మిస్తున్న వెబ్ సిరీస్ టీమ్లో ఒకరిద్దరికి కరోనా వచ్చిందట. అయితే, ఎవరు బయటకు చెప్పలేదు. ఒకరిద్దరు నిర్మాతలకు కరోనా వచ్చిందనీ, చికిత్స తీసుకుని ఆరోగ్యంగా బయటపడ్డారని ఇండస్ట్రీలో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. కరోనా కేసులను టాలీవుడ్ దాస్తుందని ప్రముఖంగా వినబడుతోంది.
బండ్ల గణేష్, ఎస్పీ బాలు, స్మిత వంటి కొందరు మాత్రమే తమకు కరోనా అని చెప్పారు. టీవీ షూటింగ్ చేసిన కొందరు మాత్రమే బయటకు చెప్పారు. తమకు కరోనా వచ్చిందని చెబితే ఎక్కడ తిరిగారు? ఇంట్లో ఉండకుండా తిరుగుళ్ళు ఏంటి? ఎవరెవరిని కలిశారు? వంటి ప్రశ్నలు వస్తాయని కొందరు దాస్తున్నారట. తమను కలిసినవాళ్లకు సమాచారం ఇచ్చి గోప్యంగా ఉంచుతున్నారట.
Also Read