బాసూ... గొడవలు పెట్టిన నాగార్జున
on Sep 22, 2020
ఆల్రెడీ మూడు సీజన్లు చూసి హౌస్లో ఎలా ప్రవర్తిస్తే వీక్షకుల మనసులు గెలుచుకోవచ్చో తెలుసుకున్నారో? అతి మంచోళ్లు అనిపించుకోవాలని అనుకుంటున్నారో? 'బిగ్ బాస్ 4'లో కంటెస్టెంట్లు అందరూ సేఫ్ గేమ్ ఆడే ప్రయత్నం చేస్తున్నారు. కొందరు నామినేషన్ టాస్క్ దగ్గర కూడా సేఫ్ గేమ్ ఆడారు. సెల్ఫ్ నామినేషన్ చేసుకున్న ఘనులు ఉన్నారు. మంచితనం, త్యాగాలు చేయడం హౌస్లో పరిపాటిగా మారింది. దాంతో కంటెస్టెంట్ల మధ్య బిగ్ బాస్, నాగార్జున కలిసి గొడవలు పెట్టారు.
లాస్ట్ వీకెండ్ ఎపిసోడ్లో హౌస్లో కంటెస్టెంట్లకు నాగార్జున ఒక టాస్క్ ఇచ్చారు. హౌస్లో ఉన్నవాళ్ళలో హీరో ఎవరు? జీరో ఎవరు? అనేది చెప్పామన్నారు. హీరో ఎందుకు అంటున్నారు? జీరో ఎందుకు అంటున్నారు? అనేది వివరించమని అన్నారు. అప్పుడు అమ్మా రాజశేఖర్ జీరో అని దేవి నాగవల్లి, లాస్య అన్నారు. నోయెల్ సహా మరికొందరు ఆయనను హీరో అన్నారు. తనను జీరో అన్నందుకు అమ్మా రాజశేఖర్ ఏడుస్తూ హౌస్ నుండి బయటకు పంపమని కోరారు. అతడు హౌస్ లో ఉండాలని గంగవ్వ కూడా చెప్పడంతో శాంతించారు. చాలామంది కుమార్ సాయి జీరో అనడంతో అతడిపై వీక్షకుల్లో సింపతీ వచ్చినట్టు ఉంది. కంటెస్టెంట్లు అందరిలో గంగవ్వకు మిగతా కంటెస్టెంట్ల నుండి స్పెషల్ ట్రీట్మెంట్ లభిస్తోంది.