బాలయ్య-నాగ్ ల మధ్య గొడవకు కారణం అదేనట!
on Nov 14, 2017
అసలు బాలయ్య, నాగార్జునలకు ఏమైంది? ఒకప్పుడు బాగానే సరదాగా ఉండేవారు. మరి ఉన్నట్టుండి ఈ బద్ద శత్రుత్వం ఎలా మొదలైంది? అంతకు ముందు.. ఎవరి ఇళ్లల్లో ఏ కార్యక్రమం జరిగినా.. రెండు కుటుంబాలు సందడి చేస్తూ కనిపించేవి. కానీ.. ఇప్పుడు ఉప్పు, నిప్పులా తయారైంది వ్యవహారం అసలు రీజన్ ఏంటి? దీనికి సమాధానం చాలామంది చాలా రకాలుగా చెప్పుకుంటుంటారు. అయిత..అసలైన కారణం ఇదని ఓ కథ వెలుగులోకి వచ్చింది. అక్కినేని నాగేశ్వరరావు 75 ఏళ్ల నట ప్రస్తానం సందర్బంలో 2012లో టి.సుబ్బిరామిరెడ్డి ఓ వేడుక చేశారు. హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగిన ఆ వేడుకకు తెలుగు చిత్రసీమకు చెందిన అతిరథ మహారథులందరినీ ఆహ్వానించారు. ఈ వేడుకకు హాజరుకానున్న నేటి స్టార్ హీరోల ఫోటోలతో వైరైటీగా ఆ ఆహ్వాన పత్రికను డిజైన్ చేశారు. అక్కినేని తర్వాత ప్రముఖంగా ప్రచురించిన ఫొటోలు.. చిరంజీవి, మోహన్ బాబు ఫొటోలు. ఆ తర్వాత ప్రయారిటీ బాలకృష్ణ, నాగార్జు, వెంకటేశ్.. ఇలా మిగలిన తారలికిచ్చారు. అసలు గొడవ అక్కడే మొదలైందని సమాచారం.
ఈ వ్యవహారంపై బాలయ్య తీవ్రమైన మనస్తాపానికి లోనయ్యాడట. విషయం తెలుసుకున్న నాగార్జున,,, స్వయంగా బాలయ్య ఇంటికెళ్తే... ఉండి కూడా లేడని బాలయ్య చెప్పించినట్టు టాక్. దాంతో అప్పటికే చాలాసేపు ఎదురు చూసిన నాగ్ అసహనంతో వెళ్లిపోయాడట. నాగ్ కి జరిగిన అవమానం గురించి తెలుసుకున్న అక్కినేని నాగేశ్వరరావు స్వయంగా బాలయ్యకు ఫోన్ చేసి తిట్టినట్టు తెలిసింది. దానికి బాలయ్య కూడా అక్కినేనికి భారీగానే కౌంటర్ ఇచ్చాడట. అక్కడ్నుంచి వారిద్దరి మధ్య సఖ్యత లేదని సమాచారం. ఆ మధ్య అన్నపూర్ణ 7 ఏకరాల్లో జరిగిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ప్రారంభోత్సవానికి చిరంజీవి, వెంకటేశ్ హాజరయ్యారు కానీ.. నాగ్ మాత్రం రాలేదు. నిజానికి నాగార్జునను పిలిస్తే బావుంటుందని దర్శకుడు క్రిష్ స్వయంగా బాలయ్యను అడిగారట. ‘ నేనైతే పిలవను. మీరు పిల్చుకుంటే అభ్యంతరం లేదు ’ అని ఖరాకండీగా చెప్పేశాడట బాలయ్య. క్రిష్ స్వయంగా వెళ్లి ఆ వేడుకకు నాగ్ ని ఆహ్వానించాడట. అయితే.. నాకు మాత్రం ‘నేను రాను’ అని నిర్మొహమాటంగా చెప్పేశాడట. అయితే... మొన్నామధ్య వైజాగ్ లో జరిగిన మోహన్ బాబు 40 ఏళ్ల వేడుకలో నాగార్జునే ఒక మెట్టు దిగొచ్చి.. బాలయ్యను పలకరించాడు.
‘మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవ్’ అని జనాల సాక్షిగా చెప్పాడు. అయితే.. దీనిపై బాలయ్య మాత్రం స్పందించలేదు. అంతేకాదు...రీసెంట్ గా జరిగిన చైతూ, సమంత మ్యారేజ్ రిసెప్షన్ కి కూడా బాలయ్య హాజరు కాలేదు. అయితే... నందమూరి, అక్కినేని కుటుంబాల మధ్య సఖ్యత మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. చైతూ, సమంత రిసెప్షన్ కి హరికృష్ణ, రామకృష్ణ హారజరై వధూవరులను ఆశీర్వదించారు.