బాహుబలి మళ్ళీ మొదలెట్టేశాడు
on Apr 21, 2014
తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతున్న తాజా చిత్రం "బాహుబలి". ప్రభాస్, అనుష్క, రానా ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని భారీ యుద్ధ సన్నివేశాలను తెరకెక్కించారు. ఈ షెడ్యుల్ తరువాత దాదాపు 15 రోజుల విరామం తీసుకున్న ఈ చిత్ర యూనిట్ మళ్ళీ తమ పనిని మొదలుపెట్టింది. నేటి నుంచి మరో షెడ్యుల్ ను హైదరాబాదులోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభిస్తున్నారు.
ప్రభాస్ ఇందులో బాహుబలి, శివుడు అనే రెండు పాత్రలలో కనిపించబోతున్నాడు. బాహుబలికి జోడిగా అనుష్క నటిస్తుండగా, శివుడుకి జోడిగా తమన్నా జతకట్టింది. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సెంథిల్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నాడు. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో ఇప్పటికే అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఈ చిత్రాన్ని 2015లో విడుదల చేయనున్నారు.