స్వీటీ.. ముచ్చటగా మూడోసారి?
on Jan 21, 2021
లేడీ సూపర్ స్టార్ అనుష్కకి అచ్చొచ్చిన నిర్మాణ సంస్థల్లో యూవీ క్రియేషన్స్ ఒకటి. ఈ సంస్థ నిర్మించిన మొదటి సినిమా మిర్చిలో స్వీటీనే మెయిన్ లీడ్ గా నటించింది. అలాగే.. ఈ ప్రొడక్షన్ హౌస్ ఇంతవరకు నిర్మించిన ఏకైక మహిళా ప్రాధాన్య చిత్రం భాగమతిలోనూ అనుష్కనే లీడ్ రోల్. ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించాయి. కట్ చేస్తే.. మూడేళ్ళ విరామం తరువాత స్వీటీ, యూవీ క్రియేషన్స్ కాంబినేషన్ లో మరో సినిమా రానుందని సమాచారం.
ఆ వివరాల్లోకి వెళితే.. సందీప్ కిషన్, రెజీనా జంటగా రా రా కృష్ణయ్య చిత్రాన్ని రూపొందించిన మహేష్ దర్శకత్వంలో అనుష్క ఓ ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం.. ఈ ప్రాజెక్ట్ ఆల్ మోస్ట్ ఓకే అయిందని టాక్. అంతేకాదు.. ఈ చిత్రాన్ని స్వీటీ లక్కీ బేనర్ అయిన యూవీ క్రియేషన్స్ నిర్మించబోతోందట. ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫినిషింగ్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కే అవకాశముంది. అలాగే, మరి కొద్ది రోజుల్లో ఈ చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.
Also Read