అఖిల్ 5కి ముహూర్తం ఫిక్స్ అయినట్టే...
on Nov 24, 2020
'మిస్టర్ మజ్ను'గా 'హలో' చెప్పిన 'అఖిల్' కి.. తొలి మూడు ప్రయత్నాల్లో నిరాశే ఎదురైంది. ఈ నేపథ్యంలో.. నాలుగో చిత్రం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' పైనే ఆశలు పెట్టుకున్నాడీ అక్కినేని బుల్లోడు. ఈ సినిమా ముగింపు దశలో ఉన్నప్పుడే స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ మూవీని సెట్ చేసుకున్నాడీ ఒకనాటి 'సిసింద్రీ'. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని నిర్మించనున్నారు.
కాగా, ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ని జనవరి చివరి వారంలో ప్రారంభించాలని సురేందర్ రెడ్డి అండ్ టీమ్ ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక సమాచారం వెల్లడయ్యే అవకాశముంది. ఇదిలా ఉంటే.. ఈ క్రేజీ వెంచర్ లో అఖిల్ కి జోడీగా సక్సెస్ ఫుల్ హీరోయిన్ రష్మిక మందన్న నటించబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. దీనిపైనా క్లారిటీ రావాల్సి ఉంది.
మరి.. అఖిల్, సూరి ఫస్ట్ కాంబో ఫిల్మ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి.