గల్వాన్ ఘటనపై బాలీవుడ్లో సినిమా
on Jul 4, 2020
భారత్ భూభాగమైన గల్వాన్ లోయలో చైనా ఘర్షణపూరిత వైఖరి రెండు దేశాల మధ్య సత్సంబంధాలకు తూట్లు పొడుస్తోంది. దీనికి చైనా ప్రభుత్వంలోని పెద్దల విస్తరణ కాంక్ష కారణం అవుతోంది. చైనా సైన్యం మన నేలపైకి చొచ్చుకు రావడంతో భారత్ సైనికులు వీరోచితంగా పోరాడి నిలువరించారు. ఈ పోరాటంలో 20మంది అమరులు అయ్యారు. సైనికుల వీరోచిత పోరాటంపై బాలీవుడ్లో సినిమా తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
గల్వాన్ ఘటనపై బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ ఓ సినిమా చేయనున్నారు. టైటిల్ ఖరారు చేయని ఈ సినిమాలో అమరులైన 20 మంది త్యాగాలను చూపిస్తారని సమాచారం. నటీనటులను కూడా ఇంకా ఖరారు చేయలేరు. అజయ్ దేవగణ్ ఫిలిమ్స్, సెలెక్ట్ మీడియా హోల్డింగ్స్ సంయుక్తంగా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయనున్నాయి. గల్వాన్ ఘటన నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ శుక్రవారం లడ్డాఖ్ లోని నిమూ ప్రాంతానికి వెళ్లారు. మరుసటి రోజు సినిమా ప్రకటన రావడం విశేషం.
Also Read