ప్రభాస్ 'ఆదిపురుష్' బడ్జెట్ ఎంతో తెలుసా?
on Oct 15, 2020
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా హిందీ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించనున్న సినిమా 'ఆది పురుష్'. ఇందులో ప్రభు రామ్ పాత్రలో ప్రభాస్ కనిపించనున్నారు. అంటే శ్రీరామ చంద్రుడు అన్నమాట. రామాయణం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటివరకూ వచ్చిన చిత్రాలకు భిన్నంగా సరికొత్తగా తెరకెక్కించనున్నారని సమాచారం. అంతేకాదు... భారతీయ సినిమా చరిత్రలో భారీ నిర్మాణ వ్యయంతో 'ఆది పురుష్' తెరకెక్కించనున్నారని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
సుమారు 350 కోట్ల రూపాయల నుండి 400 కోట్ల రూపాయల నిర్మాణ వ్యయంతో 'ఆదిపురుష్' రూపొందుతోందట. కరోనా తర్వాత భారీ బడ్జెట్ చిత్రాలు తీయాలని అనుకున్న దర్శక నిర్మాతలు అందరూ బడ్జెట్లో తగ్గించుకుంటూ వెళుతుంటే ప్రభాస్ సినిమా కి మాత్రం పెంచుతున్నారు.
కరోనా తర్వాత థియేటర్లలో విడుదలయ్యే భారీ చిత్రం కూడా ఇదేనని దర్శకుడు చెబుతున్నారు. ఇందులో విజువల్ ఎఫెక్ట్స్ కి ఎక్కువ ప్రాముఖ్యం ఉంటుందన్నారు. ప్రభాస్ తప్ప మరొకరిని ఈ చిత్రంలో హీరోగా ఊహించుకోలేదు అనేది ఓం రౌత్ చెబుతున్న మాట.
Also Read