భారతీయుడు2 సెట్లో భారీ ప్రమాదం ముగ్గురు మృతి
on Feb 20, 2020
సినీలోకం అంటేనే అదో మోజు. అన్నింటికంటే సినిమాకే లోకంల క్రేజ్ ఎక్కువ. అలాంటి సినిమాల్లో ప్రమాదాలు డైరెక్టర్ సృష్టి, కానీ సృష్టిస్తున్న సినిమాలో ప్రమాదం జరిగితే అదీ ఓ భారీ విషాదంగా మారితే కమల్ హాసన్ నటిస్తున్న ఇండియన్2 సినిమా సెట్స్ లో ఇదే జరిగింది. ఒక క్రేన్ అమాంత నేలకూలి ముగ్గుర్ని బలితీసుకుంది. చెన్నై సహా భారతీయ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ భారతీయుడు2 సినిమా షూటింగే. కమల్ హాసన్ నటించిన భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా రాబోతోంది ఇండియన్ 2. శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని 2021లో గ్రాండ్ గా రిలీజ్ చేయాలని ప్రయత్నిస్తోంది చిత్ర యూనిట్. అందుకు శరవేగంగా నిర్మాణం జరుపుకుంటోంది. ఈ క్రమంలోనే రాత్రి వేళల్లోనూ షూట్ కొనసాగించారు డైరెక్టర్ శంకర్.
సరిగ్గా రాత్రి పది గంటల సమయంలో పోరుమళ్లీలోని ఇవిపి ఫిలింసిటీలో షూటింగ్ జరుగుతోంది. అప్పటి వరకూ కొన్ని షాట్స్ తీసి కాస్త రిలాక్స్ అయ్యింది టీమ్. కమల్ హాసన్ షూట్ ముగించుకుని ఓ పక్కకు వచ్చారు. డైరెక్టర్ శంకర్ అంతకుముందు సీన్ ఎలా జరిగిందో పరిశీలిస్తున్నారు. ఈ తతంగమంతా జరుగుతోంది. సరిగ్గా అదే టైంలో ఓ టెంట్ కింద పైనుంచి ఓ భారీ క్రేన్ కంట్రోల్ తప్పి నేలకూలింది. క్రేన్ కుండే పొడవైన రాడ్ మాత్రమే కాదు ఇంజిన్ తో సహా అది పక్కకు ఒరిగిపోయింది. అయితే క్రేన్ కూలిన సమయంలో టెంట్ కింద 15మంది వరకు ఉన్నారు. క్రేన్ నేరుగా మీద పడటంతో అందులో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.
అయితే డైరెక్టర్ శంకర్ కు కూడా స్వల్ప గాయాలయ్యాయి. చనిపోయిన వాళ్లలో ఇద్దరు ప్రొడక్షన్ అసిస్టెంట్ లు మధు, చంద్రన్. మరొకరు అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణ ఉన్నారు. క్రేన్ మీద పడటంతో కనీసం గాయాలతో కూడా తప్పించుకునే పరిస్థితి లేకపోయింది. ఏకంగా వీళ్ళ ప్రాణాలే పోయాయి. ముగ్గురి మృతదేహాలను రాజీవ్ గాంధీ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇక క్రేన్ మీద పడినప్పుడు అదే టెంట్లో ఉన్న మిగతావాళ్లలో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. వాళ్లలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. చిత్ర నిర్మాణంలో సిబ్బందిగా ఉన్న మాన్సింగ్, వాసు, రాంజాన్, అరుణ్ ప్రసాద్, కుమార్, కళైచిత్ర, గునపాలమన్, తిరునావక్కరసు, మురుగుదాస్ ఉన్నారు. ఇక శంకర్ కు స్వల్ప గాయాలయ్యాయి. ఆయన తీవ్రంగా గాయపడ్డట్టు ఏకంగా కాలు ఫ్రాక్చర్ అయినట్టు వస్తున్న వార్తలు మాత్రం పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేశారు శంకర్ సన్నిహితులు. కాగా గాయపడినవాళ్లకు సవితా మెడికల్ కాలేజ్ లో ట్రీట్మెంట్ అందిస్తున్నారు.