సాయం కోసమే స్పాట్ నుంచి పరిగెత్తాను: రాజ్ తరుణ్
on Aug 21, 2019
ఇటీవల రాజ్ తరుణ్ ప్రయాణిస్తున్న వోల్వో కార్ అదుపు తప్పి నార్సింగ్ వద్ద ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఇక ఒక రోజంతా ఆ కార్ కోసం ఎవరూ రాక పోవడం, రాజ్ తరుణ్ ఆ యాక్సిడెంట్ పై స్పందించక పోవడంతో టీవీ ఛానెల్స్ లో రకరకాల కథనాలు వచ్చాయి. దీంతో ఈ రోజు సోషల్ మీడియా ద్వారా స్పందించాడు రాజ్ తరుణ్.
"నిన్నటి నుంచి చాలా మంది కాల్స్ చేస్తూ.. ఎంతో అభిమానాన్ని చూపిస్తున్నారు. అందరికి ధన్యవాదాలు. ఇక నేను రెండు మూడు నెలలుగా నార్సింగ్ సర్కిల్ మీదుగా కార్ లో ప్రయాణిస్తున్నా...అక్కడ తరచుగా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఆ చోటే సడెన్ గా టర్న్ తీసుకోవడం తో కారు కంట్రోల్ తప్పి ఒక గోడను ఢీ కొట్టడం జరిగింది. ఆ శబ్దానికి నా చెవులు దిమ్మెక్కిపోయాయి. కళ్లు కూడా సరిగా కనిపించలేదు. ఒక్కసారిగా హార్ట్బీట్ పెరిగిపోయింది. ఒక్కసారి నన్ను నేను చూసుకొని, సాయం కోసం ఇంటికి వేగంగా పరుగెత్తుకుంటూ వెళ్లాను. ఆ ఘటన దగ్గర జరిగిందిదే. ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నా. అతి త్వరలో షూటింగ్ లో పాల్గొంటా" అంటూ తన స్పందన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు రాజ్ తరుణ్.