ఊహించినంత ఫలితం రాలేదు: శర్వానంద్
on Aug 17, 2019
శర్వానంద్, కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శి జంటగా సుధీర్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం 'రణరంగం'. ఈ నెల 15న విడుదలైందీ చిత్రం. గ్యాంగ్ స్టర్ డ్రామా నేపథ్యం లో తెరకెక్కిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తో రన్ అవుతోంది. ఈ సందర్భం గా ఈ రోజు మీడియా తో ముచ్చటించాడు శర్వానంద్. "మూవీకి మేము ఊహించినంత రెస్పాన్స్ అయితే రాలేదు. ఇంకా మంచి స్పందన ఊహించాము. రివ్యూ లు కూడా కొంచెం అనుకూలంగా వచ్చి ఉంటె బావుండేది. స్క్రీన్ ప్లే నచ్చి ప్రెసెంట్ వస్తోన్న సినిమాలకు భిన్నంగా ఉంటుందని చేశాను. మాస్ కుర్రాడిగా, గ్యాంగ్ స్టార్ లా, ఇలా రెండు విభిన్నమైన షేడ్స్ తో చేసిన నా కేరక్టర్స్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. రివ్యూస్ స్టోరీ లేదు అని రాశారు. కానీ, ఇది స్క్రీన్ ప్లే బేస్డ్ ఫిలిం. ప్రశంసలు అందుతాయని అనుకున్నాం కానీ అది వర్క్ అవుట్ కాలేదు. ఇక పై ఇలాంటి సినిమాలు చేస్తానని చెప్పను. జోనర్స్ మార్చుతాను. ప్రెసెంట్ 96 చేస్తున్నా ఫిఫ్టీ పెర్సెంట్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. శ్రీకారం అనే సినిమా కూడా స్టార్ట్ చేశాను. తమిళ్, తెలుగు భాషల్లో కూడా ఒకటి కమిట్ అయ్యాను అంటూ చెప్పుకొచ్చాడు శర్వా.