యాగంటిలో వరుణ్ తేజ్ 'వాల్మీకి'
on Jun 13, 2019
వరుణ్ తేజ్ ప్రయాణిస్తున్న కారు బుధవారం ప్రమాదానికి గురైన విషయం వాస్తవమే. అయితే... ఈ వార్త బయటకొచ్చిన వెంటనే తనకు, తన తోటి ప్రయాణికులకు ఏమీ కాలేదని వరుణ్ తేజ్ క్లారిటీ ఇచ్చారు. దర్శకుడు హరీష్ శంకర్ పరోక్షంగా ఈరోజు మరో క్లారిటీ ఇచ్చారు. వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో 'వాల్మీకి' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. "యాగంటి శివుడి ఆశీర్వాదంతో ఈ ఫెంటాస్టిక్ లొకేషన్ లో షూటింగ్ స్టార్ట్ చేశాం" అని హరీష్ శంకర్ ట్వీట్ చేశారు. వరుణ్ తేజ్కి ప్రమాదం ఏమీ జరగలేదని, షూటింగులో పాల్గొంటున్నాడని పరోక్షంగా తెలిపారు. వరుణ్ తో పాటు తమిళ హీరో అథర్వ మురళి కూడా షూటింగులో పాల్గొంటున్నాడు.
Also Read