'మహర్షి'కి మ్యూజిక్ మైనస్సేనా?
on Apr 20, 2019
'1 నేనొక్కడినే' సినిమాతో మహేష్ బాబు దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ మొదలైంది. సినిమా ఫలితం పక్కన పెడితే... అందులో పాటలు ఇప్పటికీ ఎక్కడో చోట వినిపిస్తూ ఉంటాయి. తరవాత 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలలో సూపర్ స్టార్ మహేష్ కోసం అద్భుతమైన బాణీలను రాక్ స్టార్ దేవి శ్రీ అందించాడు. మహేష్-దేవిశ్రీ కాంబినేషన్ అంటే మ్యూజికల్ హిట్ కాంబినేషన్ అనే ముద్ర ప్రేక్షకుల్లో పడింది. 'మహర్షి'తో ఆ ముద్ర చెరిగిపోయేలా ఉంది. ఇప్పటి వరకు విడుదలైన మూడు పాటల్లో ఏ పాట బ్లాక్ బస్టర్, చార్ట్ బస్టర్ సాంగ్ అనేలా లేదు. ఈ బాణీలపై ప్రేక్షకులతో పాటు మహేష్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దేవిశ్రీ సంగీతాన్ని అభిమానించే వారు కూడా 'మహర్షి' పాటలపై సంతృప్తిగా లేరు.
మహేష్ కి 'మహర్షి' ప్రతిష్టాత్మకమైన సినిమా. హీరోగా మహేష్ కి 25వది. అటువంటి సినిమాకు ఇటువంటి పాటలేంటి అని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకు మ్యూజిక్ మైనస్ అవుతుందా అని సందేహపడుతున్నారు. ఇటీవల కాలంలో దేవి శ్రీ ప్రసాద్ సంగీతం రొటీన్ అవుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 'భరత్ అనే నేను' తరవాత అతడి నుంచి సరైన ఆల్బమ్ రాలేదు. ఈ ఏడాది దేవిశ్రీ నుంచి వచ్చిన చిత్రాలు... 'హలో గురు ప్రేమకోసమే', 'వినయ విధేయ రామ', 'ఎఫ్ 2', 'చిత్రలహరి'. అందులో ఓ పాట అందులో ఓ పాట బావున్నాయనుకోవడం తప్ప... బ్లాక్ బస్టర్ ఆల్బమ్ రాలేదు. 'మహర్షి'లో మిగతా పాటలైనా బావుంటాయో? లేదో? చూడాలి.