బాలకృష్ణ-రాజశేఖర్ భలే కాంబినేషన్!!
on Mar 23, 2019
టాలీవుడ్ లో ప్రజంట్ మల్టీస్టారర్ చిత్రాలు క్యూ కడుతున్నాయి. ఇక ఆ కోవలోనే మరో ఇంట్రసింగ్ కాంబినేషన్ లో ఒక మల్టీస్టారర్ సినిమా ప్రారంభం కానుందని సమాచారం అందుతోంది. రెండేళ్ల క్రితం తమిళంలో ఘన విజయం విజయం సాధించిన `విక్రమ్ వేద` చిత్రాన్ని తెలుగులో బాలకృష్ణ, రాజశేఖర్ కాంబినేషన్ లో మల్టీస్టారర్ చిత్రం రీమేక్ చేయాలని టాలీవుడ్ ప్రముఖ ప్రొడ్యూసర్ ఒకరు ప్లాన్ చేస్తున్నారట. తమిళంలో మాధవన్, విజయ్ సేతుపతి హీరోలుగా నటించారు.
ఇక తమిళ చిత్రం ఒరిజినల్ కి ఎవరైతే దర్శకత్వం వహించారో ఆ దర్శకుడే ఈ సినిమాను డైరక్ట్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అతి త్వరలోనే ఈ సినిమా పై ఒక క్లారిటీ అవకాశాలున్నాయట. ఈ కాంబినేషన్ లో సినిమా వస్తే మాత్రం అది నిజంగా క్రేజీ ప్రాజెక్ట్ గా నిలుస్తుందనడంలో సందేహం లేదు. ఎప్పటి నుంచో బాలకృష్ణ, రాజశేఖర్ లు కలిసి నటించాలనుకుంటున్నారు కానీ, ఇప్పటి వరకు కుదరలేదు. ఈ సినిమాతో కుదిరే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయట.