హీరో తమ్ముడు మతం మారాడు!
on Feb 16, 2019
యువ తమిళ కథానాయకుడు, టి. రాజేందర్ కుమారుడు శింబు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. ‘వల్లభ’, ‘మన్మథ’ సినిమాలు తెలుగులోనూ మంచి విజయాలు నమోదు చేశాయి. తర్వాత తెలుగులో పెద్ద విజయాలు దక్కలేదు. శింబుకు ఓ తమ్ముడు ఉన్నాడు. పేరు కురలరసన్. బాల నటుడిగా కొన్ని చిత్రాల్లో అతను నటించాడు. ‘ఇదు నమ్మ అల్లు’ అనే తమిళ సినిమాకు సంగీతం అందించాడు. అందులో శింబు హీరో. ఇప్పుడు ఇతని ప్రస్తావన ఎందుకంటే... కురలరసన్ మతం మారాడు. ఇస్లాం మతాన్ని స్వీకరించాడు. అతడికి తల్లిదండ్రుల నుంచి మద్దతు లభించింది. కుమారుడి మత మార్పడి కార్యక్రమానికి తల్లిదండ్రులు హాజరయ్యారు. తమిళ సంగీత దర్శకుడు, ఇళయరాజా తనయుడు యువన్ శంకర్ రాజా కూడా ఇస్లాం స్వీకరించిన సంగతి తెలిసిందే.