'పెళ్లి చూపులు' దర్శకుడితో అనసూయ...
on Jan 19, 2019
'పెళ్లి చూపులు' సినిమాతో విజయ్ దేవరకొండకు మంచి విజయాన్ని అందించిన దర్శకుడు తరుణ్ భాస్కర్. ఆ సినిమా తరవాత 'ఈ నగరానికి ఏమైంది?' అని మరో సినిమా తీశాడు. ఇప్పుడే దర్శకుడు హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడనే సంగతి తెలిసిందే. తరుణ్ భాస్కర్ను హీరోగా పరిచయం చేస్తున్నది విజయ్ దేవరకొండే. తన నిర్మాణ సంస్థ 'కింగ్ ఆఫ్ ది హిల్' పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇందులో తరుణ్ భాస్కర్ సరసన హీరోయిన్గా అనసూయను ఎంపిక చేశారని సమాచారం. 'సోగ్గాడే చిన్ని నాయనా', 'క్షణం' సినిమాల్లో అనసూయ ముఖ్యమైన పాత్రల్లో నటించారు. 'విన్నర్'లో ప్రత్యేక గీతం చేశారు. ఇటీవల విడుదలైన 'ఎఫ్ 2'లో ఓ పాటలో మెరిశారు. కానీ, ఫుల్ లెంగ్త్ హీరోయిన్గా సినిమాలు చేయలేదు. బహుశా... అనసూయకు హీరోయిన్గా ఇదే మొదటి సినిమా కావొచ్చు. ఫిబ్రవరిలో ఈ సినిమా షూటింగ్ మొదలు కానుందట. తరుణ్ భాస్కర్, అనసూయ జంటతో పాటు మరో ఇద్దరు యాక్టర్స్ ప్రధాన పాత్రల్లో కనిపిస్తారట.