ఒకే వేదికపై RRR టీమ్!!
on Dec 8, 2018
`రంగస్థలం` బ్లాక్ బస్టర్ తర్వాత మెగా పవర్ స్టార్ చేస్తోన్న చిత్రం `వినయ విధేయ రామ`. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలోని ఒక లిరికల్ వీడియో సాంగ్ ను ఇటీవల రిలీజ్ చేశారు.ఈ పాటకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుగా విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ప్రారంభించారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ లో చక్కెర్లు కొడుతోంది. అదేమిటంటే...త్వరలో జరగనున్న `వినయ విధేయ రామ` ప్రీ రిలీజ్ ఫంక్షన్ కార్యక్రమానికి ఎన్టీఆర్, రాజమౌళిలు అతిథులుగా రానున్నారట. `ఆర్ ఆర్ ఆర్` చిత్రానికి మరియు `వినయ విధేయ రామ` చిత్రానికి ఒకే నిర్మాత కావడంతో ఎన్టీఆర్, రాజమౌళిలు ఈ ఫంక్షన్ కు వస్తున్నట్లు సమాచారం అందుతోంది. గతంలో కూడా ఎన్టీఆర్ భరత్ అనే నేను చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు అతిథిగా విచ్చేసిన విషయం తెలిసిందే. దీంతో సోషల్ మీడియాలో వస్తోన్న వార్తలకు మరింత బలం చేకూరినట్లైంది.