`చిత్రలహరి`లో స్టార్ కమెడియన్!!
on Oct 18, 2018
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా `నేను శైలజ` ఫేమ్ కిషోర్ తిరుమల డైరక్షన్ లో రూపొందుతున్న చిత్రం `చిత్రలహరి`. మైత్రి మూవీ మేకర్స్ లో తెరకెక్కుతోంది. ఇటీవల పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఒక ఇంట్రస్టింగ్ న్యూస్ ప్రస్తుతం సోషల్ నెట్ వర్క్స్ లో హల్ చల్ చేస్తోంది. అదేమిటంటే స్టార్ కమెడియన్ పేరు తెచ్చుకుని హీరోగా మారిన సునీల్ ఇటీవల వరుస ఫ్లాప్స్ తో చతికలపడ్డాడు. అయితే రీసెంట్ గా అరవింద సమేత చిత్రంలో కమెడియన్ గా రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇంకా పలు చిత్రాల్లో కమెడియన్ గా క్యారక్టర్స్ చేస్తున్నాడు.
తాజాగా చిత్రలహరి సినిమా కోసం దర్శకుడు కిషోర్ ఒక మంచి పాత్ర క్రియేట్ చేశారట. ఇప్పటికే సునీల్ కి చెప్పడం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందట. మళ్లీ సునీల్ కమెడియన్ బిజీ బిజీ అవుతున్నాడన్నమాట. కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ చేస్తున్నాడు.