హీరోగా ఎంట్రీ ఇస్తున్న మహేష్ మేనల్లుడు..!!
on Oct 17, 2018
సినిమాల్లో వారసులు ఎంట్రీ ఇవ్వడం సహజం. అయితే ఎంత వారసత్వంతో ఎంట్రీ ఇచ్చినా తమ టాలెంట్ తో స్వతహాగా పేరు తెచ్చుకోవాలి. టాలీవుడ్ ఎవర్ గ్రీన్ హీరోల్లో సూపర్ స్టార్ కృష్ణ ఒకరు. ఆయన వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు సూపర్ స్టార్ రేంజ్ కి ఎదిగి దూసుకుపోతున్నారు. అదేవిధంగా కృష్ణ ఫ్యామిలీ నుండి సుధీర్ బాబు కూడా టాలీవుడ్ కి పరిచయమయ్యారు. ఆయన కూడా వైవిధ్యమైన సినిమాలు చేస్తూ పేరు తెచ్చుకున్నారు. అయితే ఇప్పుడు కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో హీరో టాలీవుడ్ కి పరిచయం కాబోతున్నట్టు తెలుస్తోంది.
మహేష్ మేనల్లుడు, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ తనయుడు అశోక్ ఎంట్రీ కి ఇప్పుడు రంగం సిద్ధమైంది. అశోక్ టాలీవుడ్ ఎంట్రీకి సంబంధించిన వార్తలు గతంలోనే వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం విజయదశమి సందర్భంగా ఈ సినిమా పూజాకార్యక్రమాలు జరగబోతున్నట్టు తెలుస్తోంది. దిల్ రాజు నిర్మాణం లో తెరకెక్కనున్న ఈ సినిమా లాంచ్ కు కృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యి మనవడిని ఆశీర్వదిస్తారట. ఈ సినిమాతో శశి అనే నూతన దర్శకుడు పరిచయం కాబోతున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ సినిమా ఒక లవ్ స్టోరీ అని.. 'అదే నువ్వు.. అదే నేను' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని సమాచారం.
Also Read