తుఫాన్ బాధితులకు నందమూరి బ్రదర్స్ చేయూత!!
on Oct 15, 2018
ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల పై తిత్లీ తుఫాన్ ప్రభావం ఎంతగా పడిందో మనందరికీ తెలిసిందే. ఈ రెండు జిల్లాలు తుఫాన్ దెబ్బకు అతలాకుతలమయ్యాయి. తీవ్రంగా ఆస్తి నష్టం జరిగింది. దీనికి స్పందించిన సినీ తారలు ఆంద్రప్రదేశ్ ముఖ్య మంత్రి సహాయక నిధికి విరాళాలు అందిస్తున్నారు. ఇప్పటికే యువ సంచలన హీరో విజయ్ దేవరకొండ ఐదు లక్షల రూపాయలు తిత్లీ తుఫాన్ బాధితులకు ప్రకటించారు. తాజాగా ఈ రోజు నందమూరి బ్రదర్స్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ 15 లక్షలు ప్రకటించగా ఆయన అన్న కళ్యాణ్ రామ్ 5లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్కు విరాళంగా ప్రకటించారు. ఇంకా మరికొందరు తిత్లీ తుఫాన్ బాధితుల కోసం విరాళాలు పంపించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఆ రెండు జిల్లాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.