గంటసేపు కాశీ గుడిలో రజనీ...
on Oct 13, 2018
సూపర్స్టార్ రజనీకాంత్కి ఆధ్యాత్మిక చింతన ఎక్కువ అనే సంగతి తెలిసిందే. తరచూ హిమాలయాలకు వెళ్లి వచ్చే రజనీకాంత్, దేశంలో పుణ్యక్షేత్రాలను కూడా సందర్శిస్తుంటారు. అటువంటి ఆయన గంగా నదీ తీరంలో కొలువై వున్న ముక్తిధామం, ఆధ్యాత్మిక నగరం వారణాసి... అదే కాశీలో వున్నప్పుడు కాశీ విశ్వనాథుని ఆలయానికి వెళ్లకుండా ఎలా వుంటారు. వెళ్లారు. రజనీకాంత్ కథానాయకుడిగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ధనుష్ నిర్మిస్తున్న సినిమా 'పెట్టా'. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వారణాసిలో జరుగుతోంది. మొన్నో రోజున షూటింగ్ పూర్తైన తరవాత కాశీ విశ్వనాథుని గుడికి వెళ్లారు. గంటసేపు దేవుని సన్నిథిలో వున్నారు. విశ్వనాథునికి సప్తరిషి హారతి జరుగుతున్నంత సేపూ అక్కడే వున్నారు. హారతి తీసుకున్నారు. పురోహితులు ఆయనకు ప్రసాదంతో పాటు రుద్రాక్ష మాలను అందజేశారు. రజనీతో పాటు త్రిష కూడా ఆయాలనికి వెళ్లారు. దైవదర్శనం తరవాత ఆలయం నుంచి బయటకొచ్చేలోపు భారీ ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకున్నారు.