బాలయ్యకు భారీ ఆఫర్స్!!!
on Sep 24, 2018
ఇటీవల కాలంలో రోజుకో ఆసక్తికరమైన వార్తతో నిత్యం వార్తల్లో ఉంటోంది `ఎన్టీఆర్` బయోపిక్. ముఖ్యంగా ఈ చిత్రంలోని పాత్రలకు వివిధ భాషల నుంచి నటీనటలను తీసుకుని ప్రాజెక్ట్ కు ఒక హైప్ ని తీసుకొచ్చారు. ఇప్పటికే ఈ చిత్రంలోని ఎన్టీఆర్ లుక్, ఏయన్నార్ లుక్, నారా చంద్రబాబునాయుడు లుక్ లకు పబ్లిక్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ చిత్రంలోని సావిత్రి పాత్ర కొరకు నటి నిత్యమీనన్ ను తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో నిత్యమీనన్ ను `మహానటి` చిత్రానికి కూడా అడిగారట కానీ, ఆమె ఎందుకో అప్పుడు ఒప్పుకోలేదు. కానీ ఈ సినిమాకు అడగ్గానే వెంటనే ఓ కే చేసినట్లు తెలుస్తోంది.
అయితే ఈ చిత్రానికి సంబంధించి తెలుస్తోన్న మరో న్యూస్ ఏంటంటే.....ఇప్పటికే ఈ సినిమాకు వచ్చిన క్రేజ్ సినిమా హక్కులకు దక్కించుకోవడానికి అమెజాన్, ఏషియన్ లాంటి పెద్ద సంస్థలు పోటీ పడుతున్నాయట. అయితే ఈ పోటీలో భారీ మొత్తం ఆఫర్ చేయడంతో ఎన్టీఆర్ బయోపిక్ నైజాం హక్కులను ఏషియన్ సంస్థ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు సినిమాకున్న క్రేజ్ ప్రకారం ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా ఉంటుందని సినీ పండితులు చెబుతున్నారు. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన బిజినెస్ క్లోజ్ అయిపోయే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి జనవరి 9న విడుదల కానుంది.