ఆ సంస్థను సావిత్రి ఆదుకుంది!!
on Sep 18, 2018
కొందరి విషాదం... మరికొందరికి వినోదం అయింది. కొందరి అపజయం మరికొందరికి విజయాన్ని చేకూర్చింది. అవును విషాదకరమైన సావిత్రి జీవిత చరిత్రతో ‘మహానటి’ సినిమా చేసి వైజయంతి మూవీస్ మళ్లీ తన పూర్వవైభవాన్ని తిరిగి తెచ్చుకుంది. ఆ సినిమా ఇచ్చిన సక్సెస్తో మరిన్ని చిత్రాలు నిర్మించడానికి వైజయంతి మూవీస్ సన్నాహాలు చేసుకుంటోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్తో పాటు సెన్సేషనల్ స్టార్ విజయదేవరకొండతో ఒక సినిమా చేయడానికి ఇప్పటికే ఆ హీరోలతో ఒప్పందం కుదుర్చుకున్నారు అశ్వనీదత్. అలాగే తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయడానికి సన్నాహా లు చేస్తున్నట్లు స్వయంగా ఈ రోజు ఏర్పాటు చేసిన పాత్రికేయు సమావేశంలో వైజయంతి మూవీస్ అధినేత అశ్వనీదత్ ప్రకటించారు. ప్రజంట్ నాగార్జున,నాని కలయికలో చేస్తోన్న మల్టీస్టారర్ చిత్రం ‘దేవదాసు’ చిత్రం గురించి ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ విషయాలు చెప్పుకొచ్చారు. ‘దేవదాస్’ చిత్రం ఈనెల 27న విడుదల కానుంది.