కమేడియన్ శవం దగ్గర నవ్వుతూ ఫొటోలు దిగిన జనం
on Jul 14, 2018
ప్రముఖ తెలుగు హాస్య నటుడు రేలంగి, ఓసారి తన బంధువు శవాన్ని చూడ్డానికి వెళ్లారట. అక్కడ రేలంగిని చూసేందుకు చుట్టుపక్కల జనం ఎగబడ్డారు. అంతేకాదు! రేలంగి ఏడుస్తున్నా కూడా వాళ్లకి నవ్వే వచ్చిందని చెబుతారు. నటుల జీవితాలు ఇలాగే ఉంటాయేమో! తాజాగా ఇలాంటి ఉదంతమే జరిగింది. వివరాల్లోకి వెళ్తే- అతనో కమేడియన్. పేరు ‘కవి కుమార్ ఆజాద్’. ‘తారక్ మెహతా కా ఉల్టా చెష్మా’ అనే సూపర్హిట్ సీరియల్లో నటిస్తున్నాడు. అందులో డా॥హాథీ అనే పేరుతోనే ఆయనను దేశం అంతా పిలుస్తూ ఉంటుంది. అలాంటి కవి కుమార్ ఈ మంగళవారం చనిపోయారు. విపరీతమైన ఊబకాయం ఉండటం వల్ల గుండెపోటుతో చనిపోయారు. చావు ఎవరికైనా సహజమే! కానీ ఆ తర్వాత జరిగిన విషయమే చాలా అసహజంగా కనిపిస్తుంది. కవి కుమార్కు నివాళి అర్పించేందుకు తోటి కమేడియన్లంతా తరలి వచ్చారట. అయితే వీళ్లందరినీ చూసిన జనం మాత్రం నవ్వడం మొదలుపెట్టారు. పక్కనే శవం ఉందని కూడా చూడకుండా, అక్కడి నటీనటులతో సెల్ఫీలు దిగే ప్రయత్నం చేశారు. చుట్టూ ఉన్నవారి ప్రవర్తనకు ఎలా స్పందించాలో తెలియని నటులు తలపట్టుకుని అక్కడి నుంచి తప్పుకున్నారు.
Also Read