ప్లీజ్, మళ్ళీ చచ్చేంత ఓపిక లేదు
on Mar 6, 2018
ఇండస్ట్రీ లో ఒకరు ఒక క్యారెక్టర్ చేస్తే మళ్ళీ అలాంటి క్యారెక్టర్ లే ఎక్కువగా వస్తాయి అంటారు. అది హీరోయిన్లు మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లకి ఎక్కువగా వర్తిస్తుంది. అయితే, ఇలాంటి సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్న హీరోయిన్ నిత్యా మీనన్ తన బాధ వ్యక్తపరిచింది. ఈ మధ్య చేసిన దాదాపు చాలా సినిమాల్లో నిత్యా మీనన్ క్యారెక్టర్ ఏదో సందర్భంలో చనిపోతుంది. విక్రమ్ ఇంకొక్కడు, విజయ్ అదిరింది, నాని నిర్మాణంలో వచ్చిన ఆ! సినిమాల్లో నిత్యా మీనన్ క్యారెక్టర్ మధ్యలో ఎండ్ అవుతుంది. అయితే, ఇప్పటి నుండి ఇలాంటి మధ్యలో చనిపోయే క్యారెక్టర్ లు చేయనని తీర్మానించుకుంది నిత్యా. కథలో సెంటిమెంట్ పాల్లు పెంచేందుకు దర్శకులు తన రోల్ ని చంపుతున్నారని, ఇవే ప్రతి సినిమాలో చేసి విరక్తి వచ్చిందని, ఇకముందు వైవిద్యం ఉన్న రోల్స్ మాత్రమే చేస్తానని ఒక ఇంటర్వ్యూ లో చెప్పింది. బాలకృష్ణ డ్రీం ప్రాజెక్ట్ ఎన్టీఆర్ బయోపిక్ లో బసవతారకం క్యారెక్టర్ ఆఫర్ చేస్తే తిరస్కరించిన ఈ మలయాళీ ముద్దుగుమ్మ, ఇవి కాకుండా వేరే సినిమాలకి కూడా నో చెప్పింది. అంతేనా, త్వరలో డైరెక్షన్ చేస్తానంటూ స్టేట్మెంట్ కూడా ఇచ్చింది.