పోసాని అసలు టార్గెట్ లోకేశ్ కాదా..? మరెవరు..?
on Nov 23, 2017
ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులు తెలుగునాట ఎంత దుమారాన్ని రేపాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అవార్డులు వచ్చినవారు.. అవార్డు రాని వారు అంటూ తెలుగు చిత్ర పరిశ్రమ రెండు వర్గాలుగా చిలీపోయింది. తెలుగుదేశం పార్టీ తనకు నచ్చిన వారికి.. అందులో కమ్మవారికి అవార్డుల్లో పెద్దపీట వేసిందంటూ ఓపెన్గానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. అలా ఈ వివాదం కొద్ది కొద్దిగా సైలెంట్ అవుతున్న టైంలో ఏపీలో ఓటర్ కార్డ్.. ఆధార్ కార్డ్ లేని వారే నంది అవార్డులపై రచ్చ చేస్తున్నారని మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించడం అగ్గికి ఆజ్యం పోసినట్లైంది. ఈ వ్యాఖ్యలపై రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి ఫైరవ్వడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. అయితే పోసాని అసలు టార్గెట్ లోకేశ్ కాదని ఫిలిం క్రిటిక్స్ అంటున్నారు.
ఆ వ్యక్తి తన శిష్యుడు, బంధువైన డైరెక్టర్ బోయపాటి శ్రీను అని వారి అభిప్రాయం. దర్శకత్వంలో అద్భుతమైన ప్రతిభ చూపే వాళ్లకు బిఎన్ రెడ్డి అవార్డు ఇస్తారు.. కానీ తీసిన ప్రతి సినిమాలో రక్తపాతం చూపించి.. తీరా శుభం కార్డు పడే టైంలో రక్తపాతం తప్పు అని చెప్పే దర్శకుడికి ఇంతటి ప్రతిష్టాత్మకమైన అవార్డ్ ఎలా ఇస్తారు అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించడమంటే బోయపాటికి అవార్డు ఇవ్వడం నచ్చకే కదా.. మొత్తానికి లోకేశ్ని సెంటర్ చేస్తూ ఇన్డైరెక్ట్గా బోయపాటిని కార్నర్ చేశాడని ఫిలింనగర్లో చర్చించుకుంటున్నారు.