నేను కమ్మోడినే.. నాకు ఈ నంది వద్దు
on Nov 21, 2017
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ప్రకటించిన నంది అవార్డులపై రేగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. నంది అవార్డుల చరిత్రలోనే ఎన్నడూ లేనంత స్థాయిలో ఈసారి విజేతల ఎంపిక వివాదాస్పదమైంది. ఏకంగా రెండు వర్గాలుగా చిలీపోయింది.. కులాల చిచ్చును రాజేసింది. ప్రభుత్వంపై అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తుండటంతో మంత్రి నారా లోకేశ్ స్పందించారు. అవార్డుల విషయంలో రచ్చ చేస్తున్న వారికి ఏపీలో ఆధార్, ఓటు హక్కు లేదన్నారు. మంత్రి వ్యాఖ్యలపై సినీ రచయిత పోసాని కృష్ణమురళి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విమర్శించే వాళ్లు నాన్ లోకల్ అయితే జ్యూరీలో ఉన్న సభ్యుల్లో నాన్లోకల్ వారు లేరా.. మరి వారిని జ్యూరీలోకి ఎలా తీసుకున్నారని ఆరోపించారు. మరోవైపు టెంపర్ సినిమాకు వచ్చిన ఉత్తమ సహాయ నటుడు అవార్డును తాను తిరస్కరిస్తున్నట్లు పోసాని ప్రకటించారు. పోసాని కమ్మోడు కాబట్టే.. ఈ అవార్డు వాడికి ఇచ్చారు అనిపించుకోవడం నాకు ఇష్టం లేదని అందుకే తాను అవార్డును తిరస్కరిస్తున్నట్లు తెలిపారు.