పద్మావతి ఆగిపోయింది..!!
on Nov 19, 2017
ప్రజంట్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా ఏ ఇండస్ట్రీలో చూసినా ఒకటే హాట్ టాపిక్. పద్మావతి రిలీజ్ అవుతుందా..? మధ్యలో ఆగిపోతుందా.. ఏ నలుగురు సినిమా వాళ్ల కలిసినా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. చరిత్రను వక్రీకరిస్తున్నారని.. తమ వంశీకులను కించపరుస్తున్నారని చిత్తోర్ఘడ్ రాజవంశీకులతో పాటు రాజ్పుత్ కర్ణీసేన ఈ సినిమాను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. షూటింగ్ సమయంలో కర్ణీసేనకు చెందిన కా
ర్యకర్తలు దర్శకుడు భన్సాలీపైనా దాడికి పాల్పడ్డారు. అయినా ఆయన వెనక్కుతగ్గకుండా సినిమాను పూర్తిచేశారు. వారి బెదిరింపులకు భయపడకుండా డిసెంబర్ 1న పద్మావతిని విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే అనుహ్యంగా తన నిర్ణయాన్ని మార్చుకుంటూ సినిమా విడుదలను వాయిదా వేసింది చిత్ర నిర్మాణ సంస్థ వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ స్టూడియో. అయితే అందుకు వేరే కారణం ఉందంటున్నారు ఫిల్మ్ క్రిటిక్స్ .. సినిమాను సెన్సార్ బోర్డు కన్నా ముందే వివిధ మీడియా ఛానల్స్కు చూపించడాన్ని సీబీఎఫ్సీ చైర్మన్ ప్రసూన్ జోషి తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో సెన్సార్ దరఖాస్తు అసంపూర్ణంగా ఉందటూ సీబీఎఫ్సీ వెనక్కి తిప్పి పంపింది. దీంతో సినిమాను వాయిదా వేస్తున్నట్లు నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారు.