ఆ సినిమానే మళ్లీ తీశావా నానీ...?!
on Jan 16, 2017
''ఓ కుర్రాడు. గాలికి తిరుగుతుంటాడు. ఓ అమ్మాయిని చూస్తాడు. ప్రేమించేస్తాడు. రూలు ప్రకారం.. ఆ అమ్మాయి మొదటి నాలుగు సీన్స్ లో ఇతడంటే కోపంతో ఊగిపొతుంటుంది. ఇతగాడు మాత్రం కొక్కిరాయి వేషాలు వేస్తూ ''నన్ను ప్రేమించాల్సిందే'' అని వెంటపడతాడు. ఇంటర్వెల్ కి ముందు ఆ అమ్మాయి మనసు కరిగిపోతుంది. కుర్రాడి ప్రేమలో పడిపోతుంది. మళ్ళీ రూలు ప్రకారం ఆ అమ్మాయి తండ్రికి కుర్రాడు సుతరామూ నచ్చాడు. ఇక ఛాలెంజులు. మళ్ళీ రూలు ప్రకారం ఈఛాలెంజ్ లో కుర్రాడిదే విన్ను'' తెలుగు సినిమాలో పరమ పరమ రొటీన్ లైన్ ఇది.
అయితే ఈ లైన్ పట్టుకుని అటు ఇటు చేసి వినోదం పంచేస్తున్నారు నవతరం దర్శకులు. ఆ మధ్య రాజ్ తరుణ్ హీరోగా వచ్చిన ''సినిమా చూపిస్తా మావా' స్టోరీ కూడా ఇదే. దర్శకుడు త్రినాద్ నక్కిన ఈ చిత్రానికి తీశాడు. మంచి ఫలితాన్నే ఇచ్చింది.ఇప్పుడు మరోసారి ఇదే ఫార్ములను నాని తో వర్క్ అవుట్ చేయాలని ఫిక్స్ అయిపోయారు. నాని కొత్త సినిమా 'నేను లోకల్'. త్రినాద్ నక్కిన దర్శకుడు. కీర్తి సురేష్ హీరోయిన్. ఈ సినిమా ట్రైలర్ బయటికి వచ్చింది. ఈ ట్రైలర్ చూస్తే.. సినిమా చూపిస్తా మావా' కి పార్ట్ 2తీశారా ? అనిపిస్తుంది. లెక్కలేనితనం వున్న ఓ కుర్రాడు ఓ అమ్మాయి వెంటపడటం, అమ్మాయి చీదరించుకుకోవడం, అమ్మాయి తండ్రిని కూడా బఫూన్ ను చేసేయడం.. ఇలా అన్నీ 'సినిమా చూపిస్తా మావా' ఛాయలే కనిపించాయి.
అయితే కామెడి పంచులు మాత్రం పేలిపోయాయి. నాని తనదైన టైమింగ్ తో ట్రైలర్ మొత్తం నవ్వించేశాడు. ఇప్పుడు ప్రేక్షకులు అభిరుచి కూడా అదే. వినోదాన్నే ఎక్కవగా కోరుకుంటున్నారు. ఇప్పుడు దాన్ని భేస్ చేసుకొనే పాత కధను అటు ఇటుగా చేసి 'నేను లోకల్' ను తయారు చేసినట్లు వున్నారు. ఇప్పుడు నాని ఫుల్ జోష్ లో వున్నాడు. భలే భలే మగాడివోయ్, కృష్ణగాడివీర ప్రేమగాథ, జెంటిల్మెన్, మజ్ను.. వరుస సక్సెస్ లతో ఫుల్ ఫాంలో వున్నాడు. ఇక ఈ ట్రైలర్ కూడా నవ్వించే గ్యారంటీ అయితే ఇచ్చేసింది. మరి, ఫైనల్ రిజల్ట్ ఎలా ఉటుందో చూడాలి.