అరవింద్ స్వామి డబ్బింగ్ కు యువ సింగర్...
on Dec 4, 2016
మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన 'ధృవ' సినిమా ఈ నెల 9 వ తేదీన రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. అయితే తమిళ సినిమా ‘తనీ ఒరువన్’ రీమేక్ గా వస్తున్న ఈ సినిమాలో విలన్ గా నటించిన అరవింద్ స్వామినే..తెలుగులో విలన్ గా కూడా ఆయననే తీసుకున్నారు. తమిళ సినిమాలో విలన్ పాత్రలో అద్భుతంగా నటించిన అరవింద్ స్వామి అయితేనే ఈ పాత్రకు న్యాయం చేయగలడని.. తెలుగు సినిమాలో కూడా ఆయననే కావాలని తీసుకున్నారు. ఇంకా ఈ సినిమాలో అరవింద్ స్టైలిష్ విలన్గా కనబడనున్నాడు. అయితే అరవింద్కు తెలుగు రాకపోవడంతో డబ్బింగ్ తప్పనిసరి అయింది. అయితే అరవింద్ కు ఎవరు డబ్బింగ్ చెబితే బావుంటదా అని.. రెగ్యులర్ గా చెప్పించే వాయిస్ కాకుండా కాస్త కొత్తగా ఆలోచించి ఓ యువ సింగర్తో డబ్బింగ్ చెప్పించారు. అతను ఎవరో కాదు సింగర్ హేమచంద్ర. హేమచంద్ర ఈ పాత్రకు డబ్బింగ్ చెప్పాడు. మరి అరవింద్ స్వామికి.. హేమచంద్ర వాయిస్ ఎంత వరకూ సూట్ అవుతుందో చూద్దాం..